మేఘాలలో ఉండే ఐస్ క్రిస్టల్స్ ,గాలి వలన ఒకదాన్నొకటి ఢీకొంటూ ,ఒక పద్ధతి లేకుండా ప్రవహిస్తూ ఉంటాయి.అలా ఢీకొన్నప్పుడు అందులో ఉండే ఎలక్ట్రాన్స్ ఒకదాని నుంచి ఇంకోదానిలోకి పాస్ అవుతాయి.ఈ ప్రక్రియ వలన మేఘంలోని పైన భాగం అనుకూలంగా(పాసిటీవ్గా), మరియు మేఘంలోని కింది భాగం ప్రతికూలంగా(నెగటీవ్గా) ఛార్జ్ అవుతూఉంటాయి.
భూమికి పాసిటీవ్ ఛార్జ్ ఉంటుంది.భూమికి ఉండే పాసిటీవ్ ఛార్జ్ కి ,మేఘాల కింద భాగంలో ఉండే నెగటివ్ ఛార్జ్ ఆకర్షింపబడతుంది(వ్యతిరేక ఛార్జెస్ మధ్య ఆకర్షణ ఉంటుంది ).ఆ పాసిటీవ్ మరియు నెగటీవ్ ఛార్జెస్ కలుసుకోవాలంటే అవి గాలి యొక్క ఇన్సులేటింగ్ లక్షణాలని(Insulating properties) అధికమించాలి. ఒక పరిధి తరువాత మేఘం కింద నెగటివ్ ఛార్జ్ పెరిగి అది గాలి యొక్క ఇన్సులేటింగ్ లక్షణాలని అధికమించేంత బలంగా తయారవుతుంది.
అప్పుడు ఈ నెగటివ్ ఛార్జ్ అంతా ఒకేసారి పాసిటీవ్ ఛార్జ్ యొక్క గుంపు(నెగటివ్ ఛార్జ్ ఆకర్షణ వలన పాసిటీవ్ ఛార్జ్ ఒక చోట ఎత్తులో గుంపుగా ఏర్పడుతుంది) వైపు పారతుంది.ఇలా ఇవి రెండు కలిసినప్పుడు మెరుపు వస్తుంది.
ఈ మెరుపు వల్ల దాని చుట్టూ ఉండే గాలి ఒకేసారి బాగా వేడెక్కుతుంది.ఈ తీవ్రమైన వేడి వలన గాలి చాలా వేగంగా విస్తరిస్తుంది.అలా వేగంగా విస్తరించడం వలన షాక్ వేవ్ ఏర్పడి పెద్ద శబ్దం వస్తుంది.ఆ శబ్దమే ఉరుము.
మెరుపు,ఉరుము ఒకేసారి ఏర్పడినా మెరుపు వచ్చిన కాసపటికి ఉరుము వస్తుంది.దానికి కారణం వాటి వేగం.మెరుపు అనేది కాంతి.ఉరుము అనేది శబ్దం.కాంతి యొక్క వేగం గంటకి దాదాపు గంటకి 300000000 మీటర్లు అయితే శబ్ధం యొక్క వేగం గంటకి 1235000 మీటర్లు మాత్రమే.అందుకే శబ్దం యొక్క వేగం, కాంతి వేగం కన్నా తక్కువ ఉండడం వల్ల మెరుపు వచ్చిన కాసేపటికి ఉరుము వస్తుంది.