📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

మొల్ల

అతుకూరి మొల్ల (1440-1530) కవయుత్రి. తెలుగులో మొల్ల రామాయణముగా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణమును వ్రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించినది. మొల్ల శైలి చాలా సరళమైనదని మరియు రమణీయమైనదని ప్రసిద్ధి. కడపజిల్లా గోపవరం ప్రాంతానికి చెందినదని అంటారు. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఇక్కడ ఉన్నది. గ్రామస్తులు ఈ బండకు పూజలు కూడా చేస్తారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ గోపవరంలో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకుంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరు గ్రామానికి చెందివుందటారని అంటారు. మొల్ల నివసించిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు కూడా ఉంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని పెద్దన కవి కూడా గోపవరం వచ్చినట్లు కొందరి వృద్ధుల కథనం.

మొల్ల స్వతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్నతనంలోనే తల్లిని కోల్పోగా తండ్రి కేశవ ఈమెను గారాబంగా పెంచాడని తెలుస్తుంది. ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టం. చివరిదాకా తండ్రి యొక్క ఇంటి పేరునే ఉపయోగించడము వలన మొల్ల పెళ్ళిచేసుకోలేదని అంటారు.

మొల్ల రామాయణము ఆరు కాండములలో 138 పద్యములతో ఉన్నది. ఈ కావ్యమును మొల్ల కేవలం ఐదు రోజులలో వ్రాసినదని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధముగా వాడుక భాషకు దగ్గరలో ఉంది.

Leave a Reply

Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading