📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

Sri Kasi Visweswara Lingam..కాశీ విశ్వేశ్వర లింగము

కాశీ విశ్వేశ్వర లింగము సృష్టిని నిర్మించతలచి పరమేశ్వరుడు శివశక్తి స్వరూపము దాల్చినాడు. ఆ అర్థనారీశ్వరరూపము నుండి పురుషుడగు నారాయణుడు, ప్రకృతి అవతరించారు. వారికి తామెవరో ఎక్కడ నుండి వచ్చారో తెలియలేదు.

అప్పుడు అశరీరవాణి అఖిలాండ కోటి బ్రహ్మాండములను సృష్టించుటకు మీరు సృజించబడ్డారు. ఆ శక్తిని పొందుటకు, పరబ్రహ్మము గూర్చి తపస్సు చేయండి అని అని వినిపించింది. అయితే ఎటుచూసినా జలమే తప్ప నివశించుటకు స్థలమే కానరానందున ఎక్కడ తపస్సు చేయాలో వారికి తెలియలేదు.

అప్పుడు పరబ్రహ్మ తేజము నుండి ఐదు క్రోసుల విస్తారము గల ఒక పట్టణము ఉద్భవించినది. అదేకాశీ పట్టణం. నారాయణుడు కాశీ పట్ఠణము నందు ఘోర తపస్సు చేయగా ఆ తపోవేడిమికి అతడి శరీరమున చెమటలు పట్టగా ఆ నీరు కాలువలై ప్రపవహించినది నారాయణుడా జలములను ఆశ్ఛర్యముతో తిలకించగా అతడి చెవికమ్మ జారి జలమునందు పడిపోయినది. ప్రదేశమే మణికర్ణకగా విరాజిల్లుతోంది. ఆ జలరాశి యందు మునిగిన కాశీ పట్టణమును శివుడు తన శూలాగ్రము నందు ధరించి రక్షించినాడు.

ఆ తరువాత నారాయణుడి నాభినుండి బ్రహ్మ అవతరించాడు. అతడు పదునాలుగు భువనములను, దేవ, మానవ, దానవ జాతులను పశుపక్ష్యాదులను సృష్టించాడు. బ్రహ్మండమును రెండు భాగములుగా ఛేదించి పై భాగాన ఏడు లోకాలను క్రింది భాగాన ఏడు లోకాలను సృష్టిస్తాడు.

అప్పుడు విష్ణు, బ్రహ్మాది దేవతలు మహర్షులు పరమేశ్వరుని స్మరించి ప్రార్థిస్తారు. వారి భక్తికి శివుడు సంతసించి వరము కోరుకొమ్మన్నాడు. అప్పుడు వారు దేవా నీవిచటనే శాశ్వతముగా అవతరించి సృష్టిని చల్లగా కాపాడమని ప్రార్థిస్తారు. అంతట శివుడు విశ్వేశ్వరుడనే పేరిట కాశీ పట్ఠణము నందు జ్యోతిర్లింగ రూపుడై వెలిశాడు.

కాశీపట్టణము వరుణ, అసి అను రెండు నదుల మధ్య నుండుట చేత ‘‘వారణాసి’’గా పేరు పొందినది. ఇచ్చట బ్రహ్మ, విష్ణు అనేక మంది దేవతలు యజ్గ్నాలు చేసారు. ఇక్కడ ఆదిశక్తి అన్నపూర్ణగా వెలసినది. కాలభైరవుడు ఈ క్షేత్ర పాలకుడు, గణపతులు, నవదుర్గలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాధిత్యులు, నవగ్రహములు ఇచట కొలువై ఉన్నారు.

ఎలా వెళ్ళాలి ? ఉత్తరప్రదేశ్ నందు గల కాశీకి ఆంధ్రప్రదేశ్ లోని అని ముఖ్యపట్టణముల నుండి విమాన మరియు రైలు సౌకర్యం కలదు.

Leave a Reply

Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading